విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ ముందు అన్నదాన కార్యక్రమం విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ హాస్పిటల్ ముందు అన్నదాన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పేదలు, నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు, రోగుల సహాయకులు మరియు ఆకలితో ఉన్న ప్రజలు ఉచిత భోజనం పొంది లబ్ధి పొందారు."ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయంగా భోజనం అందించడం" అనే లక్ష్యంతో విధాత స్వచ్చంద సంస్థ ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు జి. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో వాలంటీర్లు సంధ్య, రాధ, శ్రీవాణి, దీపక్ తదితరులు పాల్గొని తమ విలువైన సేవలను అందించారు. మీరు కూడా ఈ సేవలో భాగస్వాములు కావచ్చు. మీ పిల్లల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, పెద్దల జ్ఞాపకార్థం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో మీ కుటుంబ సభ్యుల పేరుపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించవచ్చు. విధాత స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప...